Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీపై కేటీఆర్ ప్రశంసల జల్లు.. అత‌నో అసాధార‌ణ ఫినిష‌ర్

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (16:21 IST)
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తన ట్విట్టర్‌ పేజీలో ధోనీని కొనియాడాడు. ధోనీకి వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్రమే అని కేటీఆర్ పోస్ట్ చేశారు.
 
ధోనీ ఓ ఛాంపియ‌న్ క్రికెట‌ర్ అని, అత‌నో అసాధార‌ణ ఫినిష‌ర్ అని కితాబిచ్చారు. రోజు రోజుకు ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ మ‌రింత ప‌రిణితి చెందుతున్నాడని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. 
 
చివరి 4 బంతుల్లో చెన్నై జట్టు 16 పరుగులు చేయాల్సిన స్థితిలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ మరోసారి తనదైన శైలిలో వరుసగా 6, 4, 2, 4 పరుగులతో మ్యాచ్‌ను గెలిపించాడు. 
 
కాగా ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు  మాత్రం వరుసగా ఏడో పరాజయాన్ని మూటగట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments