ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా ప్రాబబుల్స్ జట్టు ప్రకటన

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (11:53 IST)
ఇంగ్లాండ్ జట్టుతో సొంతగడ్డపై భారత్ సిరీస్‌లు కొనసాగుతున్నాయి. ఇదివరకే టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం టీ20 సిరీస్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక టీ20 జరగనుంది.
 
ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న పేటీఎం వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రాబబుల్స్ ఆటగాళ్లను ప్రకటించింది. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించనుండగా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పాండ్యా బ్రదర్స్‌కు అవకాశం ఇచ్చింది. తొలిసారిగా బౌలర్ ప్రసిద్ కృష్ణను ఎంపిక చేయడం గమనార్హం.
 
ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా ప్రాబబుల్స్‌..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తర్వాతి కథనం
Show comments