Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అవుటైతే పర్లేదు.. టీ-20ల్లో పరుగులే ముఖ్యం

కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తర

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (10:12 IST)
కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ చేయకుండా.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మాజీ కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తరువాత ధోనీని అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు విమర్శించగా, గవాస్కర్ వంటి వారు వెనకేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ ఆటతీరుపై వస్తున్న విమర్శల సందర్భంగా సెహ్వాగ్ స్పందించాడు. 
 
ధోనీకి విలువైన సలహా ఇచ్చాడు. వన్డేలతో పోలిస్తే, టీ-20ల్లో పరిస్థితి వేరుగా ఉంటుందన్నాడు. ఇది ధోనీకి తెలియని విషయమేమ కాదంటూనే.. మిడిలార్డర్‌లో వచ్చే ధోనీ.. నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకుండా, తొలి బాల్ నుంచే పరుగులు చేసేందుకు ప్రయత్నించాలన్నాడు. ఈ ప్రయత్నంలో అవుటైపోయినా పర్లేదు కానీ, క్రీజులో పాతుకుపోయి పరుగులు చేయకుండా ఉండటం సరికాదన్నాడు. 
 
ఆడిన నాలుగు బంతులనూ బౌండరీలకు పంపితే, టీ-20ల్లో మేలు కలుగుతుందని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. సాధించాల్సిన పరుగులు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ధోనీ వంటి ఆటగాడు, వేగాన్ని పెంచలేకపోతే ఆ ప్రభావం జట్టు మీద పడుతుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments