Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాట్లాండ్ పైన భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలున్నట్లేనా?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (23:04 IST)
టి20 ప్రపంచ కప్, భారతదేశం vs స్కాట్లాండ్ మ్యాచ్ అనుకున్నట్లే జరిగింది. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ సెమీ-ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి జరుగుతున్న ICC T20 ప్రపంచ కప్‌లో సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది.
 
లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా, పేసర్ మహమ్మద్ షమీ తలో మూడు వికెట్లు తీయడంతో స్కాట్లండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. స్కాట్లాండ్ తరఫున ఓపెనర్ జార్జ్ మున్సే 24 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు.
 
ఇక టీమిండియా విషయానికి వస్తే.. 86 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కేఎల్ రాహుల్ (50), రోహిత్ శర్మ (30) ఐదు ఓవర్లలో 70 పరుగులు జోడించి స్కాట్లాండ్‌ను ఆశలను పూర్తిగా వమ్ము చేసారు. కేవలం 6.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించింది.
 
స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 ఆలౌట్. (జార్జ్ మున్సే 24, క్రిస్ గ్రీవ్స్ 21; ఆర్ జడేజా 3/15, ఎం షమీ 3/15). భారత్ 6.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. (కేఎల్ రాహుల్ 50, ఆర్ శర్మ 30; బి వీల్ 1/32).

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

నటి హేమ పాల్గొన్నారు... ఆ వీడియోపై విచారణ జరుపుతున్నాం : బెంగుళూరు సీపీ

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

పిఠాపురం నుంచి అప్పుడే పనులు మొదలెట్టిన పవన్

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

తర్వాతి కథనం
Show comments