Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ టూర్‌ కోసం సూర్య కుమార్ - పృథ్వీ షా ఎంపిక

Webdunia
సోమవారం, 26 జులై 2021 (14:13 IST)
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్ ఆరంభంకాకముందే జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. ఈ టూర్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొదట ప్రారంభంకానుంది. 
 
అయితే, వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్ మన్ గిల్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టాండ్ బైగా ఎంపికైన పేసర్ అవేశ్ ఖాన్‌లు గాయపడ్డారు. వీరు కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలపడంతో... టీమ్ మేనేజ్‌మెంట్ రీప్లేస్‌మెంట్ కోరింది.
 
దీంతో, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో ఇద్దరు ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపాలని నిర్ణయించింది. సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే. 
 
పైగా, ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. వీరిద్దరిలో పృథ్వీ షాకి ఇప్పటికే టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఇదే తొలి టెస్టు సిరీస్ కానుంది. 
 
అలాగే, సూర్యకుమార్ ఈ ఏడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంక సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలి వన్డే సిరీస్‌లోనే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ - సరిహద్దుల్లో రోబోటిక్ గ్రిడ్స్

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments