Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మూడో "సిక్సర్ల" వీరుడు సురేష్ రైనా

పొట్టి క్రికెట్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన సురేష్ రైనా మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డుపుటలకెక్కాడు. శ్రీలంక వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేష్ రైనా సిక్సర్ సాయంతో 27 బంతుల్

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (10:48 IST)
పొట్టి క్రికెట్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన సురేష్ రైనా మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డుపుటలకెక్కాడు. శ్రీలంక వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేష్ రైనా సిక్సర్ సాయంతో 27 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌ సాయంతో ట్వింటీ20 మ్యాచ్‌లలో సురేష్ రైనా మొత్తం 50 సిక్సర్లు కొట్టిన మూడో భారతీయ క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. 
 
ఈ జాబితాలో ఇప్పటివరకు 74 సిక్సర్లతో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 69 సిక్సర్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయంగా చూస్తే విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్, న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
 
కాగా, గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ ట్రోఫీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన భారత్ ఈనెల 12న మరోసారి శ్రీలంకతో తలపడనుంది. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments