Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2024 : పది ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోవడం నమ్మలేకపోతున్నా : కమిన్స్

ఠాగూర్
గురువారం, 9 మే 2024 (10:47 IST)
ఐపీఎల్ 2024 టోర్నీ ముగింపు సమయం దగ్గరపడేకొద్దీ ఆయా జట్ల ఆటగాళ్ళ ఆటతీరు అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా, పలువురు ఆటగాళ్ళు బ్యాట్‌తో రెచ్చిపోతున్నారు. బౌలర్లు బంతితో శాసిస్తున్నారు. బుధవారం రాత్రి లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయభేరీ మోగించింది. ప్రత్యర్థి ఉంచిన విజయలక్ష్యాన్ని కేవలం పది ఓవర్లలోనే చేధించింది. 
 
ఈ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు స్కోరు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. కానీ, హైదరాబాద్ ఆటగాళ్లు మాత్రం దుమ్ములేపారు. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేయగా, అభిషేక్‌ శర్మ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలవడమే కాకుండా లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. వీరి విశ్వరూపంతో ఉప్పల్‌ స్టేడియం బౌండరీలతో మోతమోగిపోయింది. 166 పరుగుల లక్ష్యం కేవలం 9.4 ఓవర్లలోనే కరిగిపోయింది. దీంతో హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తుచేసి ప్లే ఆఫ్స్‌నకు మరింత చేరువైంది.
 
ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ స్పందిస్తూ, 'ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్ తమ ఆటతో పిచ్‌ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. వారి స్వేచ్ఛకు మేము అడ్డుచెప్పలేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లుకు ఎంతో పాజిటివ్‌ దృక్పథం ఉంది. వారు ఎలా ఆడాలో, ఆడకూడదో ఒక బౌలర్‌గా నేను సలహాలు ఇవ్వలేను. హెడ్‌ గత రెండేళ్లుగా కష్టసాధ్యమైన పిచ్‌లపై విజృంభిస్తున్నాడు. విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇది సాధారణ విషయం కాదు. 
 
అభిషేక్‌ శర్మ అద్భుత ఆటగాడు. స్పిన్‌, పేస్‌ ఏ బౌలింగ్‌లోనైనా ఆడగలడు. కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఔట్‌సైడ్‌ సర్కిల్‌లో ఉండే పవర్ ప్లే సమయంలో బౌలర్లు వీరిని ఎదుర్కోవడం కష్టంతో కూడుకున్న పని. వికెట్లు పడకుండా బ్యాటర్లు చెలరేగుతున్నప్పుడు నిజంగా వారు ఎన్ని పరుగులు సాధిస్తారని చెప్పడం కష్టమే. ఈ ఇద్దరు బ్యాటర్లకు ఇది అద్భుతమైన సీజన్‌గా చెప్పవచ్చు. 10 ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించడం.. నమ్మశక్యం కాని విధంగా ఉంది' అని కమిన్స్ అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments