Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్ వన్డే.. సెంచరీ చేసిన గిల్.. అరుదైన రికార్డు సొంతం

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (16:47 IST)
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మూడో వన్డే డే అండ్ నైట్ మ్యాచ్ బుధవారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించారు. కేవలం 50 ఇన్నింగ్స్‌లలోనే గిల్ ఈ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 
 
ఇలాంటి అరుదైన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకిసైతం సాధ్యంకాకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తం 102 బంతులు ఎదుర్కొన్న గిల్ మూడు ఫోర్లు, 14 ఫోర్ల సాయంతో 112 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 
 
ఇకపోతే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకోగా, ఈ మ్యాచ్‌లో మరోమారు విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ 52, శ్రేయాస్ అయ్యర్ 78, రాహుల్ 21 (నాటౌట్), పాండ్యా 17, పటేల్ 13, సుందర్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: కేరళ, తమిళనాడు ఆలయాల సందర్శన వ్యక్తిగతం.. పవన్ కల్యాణ్

చీరల వ్యాపారం కోసం వెళ్లిన భర్త.. ఇంట్లో భార్య రాసలీలలు.. ఎండ్ కార్డు ఎలా పడిందంటే..

Viral Video: వీడెవడ్రా బాబూ.. ఎమెర్జెన్సీ విండో ద్వారా రైలులోకి.. (video)

వీల్‌చైర్‌లో సీఎం సిద్ధరామయ్య - చేయిపట్టుకుని కలియతిరిగిన రాజ్‌నాథ్ (Video)

అగస్త్య మహర్షి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

మెగా ఫ్యామిలీ హీరోలకు 'పుష్పరాజ్' దూరమైనట్టేనా? చెర్రీ అన్‌ఫాలో..

నటుడు పృధ్వీ ఆసుపత్రి పాలు కావడానికి వారే కారణం !

బద్మాషులు మన ఊరి కథ : రచ్చరవి

సుబ్రమణ్యేశ్వర స్వామియే నన్ను పిలిపించుకున్నారు :విశ్వక్సేన్

తర్వాతి కథనం
Show comments