Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో ట్వంటీ20లో భారత్ గెలుపు - సిరీస్ కైవసం

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (09:44 IST)
భారత క్రికెట్ జట్టు మరో విజయం సాధించింది. స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరుగనుంది. మరోవైపు, ఇది భారత జట్టుకు వరుసగా ఎనిదో విజయం కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఓపెనర్ నిశ్శంక 53 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులతో చెలరేగడానికితోడు మ్యాచ్ ఆఖరులో కెప్టెన్ షనక 19 బంతుల్లో రెండో ఫోర్లు, ఐదు సిక్సర్లతో వీర విహారం చేసి 47 పరుగులు చేయడంతో మొత్తం 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో 17 బంతులు మిగిలివుండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇది భారత్‌కు వరుసగా ఎనిమిదో విజయం కాగా, కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం గమనార్హం. 
 
ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (16) పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 44 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అలాగే సంజు శాంసన్‌ కూడా 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు, రవీంద్ర జడేజా 18 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 45 పరుగులు చేయడంతో అపురూప విజయాన్ని అందించాడు. బ్యాటింగులో ఇరగదీసిన శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments