Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేపై స్కాట్లాండ్ అదుర్స్.. కేవలం 41 బంతుల్లోనే అతివేగ రెండో సెంచరీ

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:54 IST)
నెదర్లాండ్‌తో ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ క్రికెటర్లు అదరగొట్టారు. వీరిలో ఓపెనర్ హెన్రీ జార్జ్ మున్సే టీ-20 క్రికెట్‌లో రికార్డులతో అదరగొట్టాడు. కేవలం 41 బంతుల్లోనే శతకం నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ ట్వంటీ-20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. 56 బంతుల్లో 127 పరుగులు చేసిన మున్సే 14 సిక్స‌ర్లు, 5 ఫోర్లు కొట్టాడు. 
 
మున్సేతో పాటు కెప్టెన్‌ కోయిట్జర్‌ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. వీరిద్ద‌రి వీర ఉతుకుడుతో స్కాట్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 41 బంతుల్లో సెంచ‌రీ చేసిన మున్సే ఫాస్టెస్ట్‌ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments