Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిమ్మలను చూసి గర్విస్తున్నాం.. మీకంటూ ఓ రోజు వస్తుంది.. సచిన్

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (08:10 IST)
ఐసీసీ మహిళల ట్వంటీ20 క్రికెట్ టోర్నీ భారత యువ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. లీగ్ మ్యాచ్‌లన్నింటిలో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన భారత జట్టు.. ఫైనల్‌లో మాత్రం ప్రత్యర్థి జట్టు ముందు తలవంచింది. దీంతో ట్రోఫీని తొలిసారి ముద్దాడాలన్న కోరిక నెరవేరలేదు. పైగా, ఈ ఓటమితో జట్టు సభ్యులు బోరున విలపించారు. కుంగిపోయారు. 
 
ఈ నేపథ్యంలో యువ మహిళా క్రికెటర్ల ఆటతీరుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలియజేశారు. "టీమిండియాకు ఇది నిజంగా క్లిష్టమైన సమయం. మనది ఇంకా యువ జట్టే కాబట్టి భవిష్యత్తులో మరింత దృఢమైన జట్టుగా ఎదుగుతుంది. ఇప్పటివరకు మీ ప్రదర్శన పట్ల ఎంతో గర్విస్తున్నాం. కఠోరంగా శ్రమించండి, ఆశాభావాన్ని వీడొద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా సాధిస్తారు" అంటూ ట్విట్టర్‌లో ఓదార్పు వచనాలు పలికారు.
 
కాగా, మహిళల టి20 వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా వచ్చిన టీమిండియా, ఆఖరిపోరాటంలో విఫలం కావడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారీ లక్ష్యఛేదనలో కనీస పోరాటం కూడా లేకుండా టీమిండియా అమ్మాయిలు ఓడిన విధానం మరింత బాధిస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments