Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలన నిర్ణయం తీసుకున్న సచిన్ టెండూల్కర్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (12:45 IST)
మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగాల్సిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ టోర్నీ త్వరలోనే ప్రారంభంకానుంది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు సచిన్ ప్రకటించారు. 
 
కాగా, ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఒమన్ వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజ్ జట్టు తరపున సచిన్ బరిలోకి దిగాల్సివుంది. అయితే, ఈ లీగ్‌లో ఆడనని సచిన్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
కాగా, ఈ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో టీమిండియాకు చెందిన మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ బరిలోకి దిగబోతున్నారు. ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్ జట్టుతో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు పాల్గొంటున్నాయి. 
 
ఆసియా లయన్స్ తరపున ఆసియా క్రికెటర్లు ఆఫ్రిది, జయసూర్య, షోయబ్ అక్తర్, మురళీధరన్, వరల్డ్ జెయింట్ తరపున ఆసియా క్రికెటర్లు జాంటీ రోడ్స్, షేన్ వార్న్, షాన్ పొలాక్, బ్రియాన్ లారా వంటి ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments