భారత క్రికెట్ జట్టుతో ఎన్టీఆర్... నజీర్ ఖాన్ ఇంట్లో సందడి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (15:12 IST)
భారత్‌తో క్రికెట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ నగరానికి చేరుకుంది. అలాగే, భారత జట్టు కూడా ఇక్కడకు వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం జరుగనుంది. దీంతో ఇరు జట్లూ సరదాగా గడిపారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిశాడు. సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, చాహల్, శార్దూల్ ఠాకూర్‌లు ఉన్నారు. వీరిని కలుసుకున్న ఎన్టీఆర్ సరదాగా ముచ్చటించారు. 
 
హైదరాబాద్ నగరంలో ఖరీదైన కార్‌ కలెక్షన్స్‌తో ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌ వాసి నజీర్ ఖాన్‌ ఇంట్లో క్రికెటర్లు, ఎన్టీఆర్‌ల మధ్య భేటీ జరిగింది. టీమిండియా ఆటగాళ్లలో పలువురు నజీర్‌కు స్నేహితులు ఉండటంతో వారంతా అతడి ఇంటికి వచ్చారు. క్రికెటర్లతో తమ అభిమాన నటుడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోయారు.
 
ముఖ్యంగా, "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటు-నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్‌ను అందుకోవడంపై సూర్యకుమార్‌ యాదవ్‌ శుభాకాంక్షలు చెప్పాడు. తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి ఎన్టీఆర్‌తో దిగిన  ఫొటోను సూర్యకుమార్‌ యాదవ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. సూర్య పోస్టుకు ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. "ధన్యవాదాలు సూర్య.. రేపు (కివీస్‌పై) మ్యాచ్‌లో అదరగొట్టాలి" అంటూ రిప్లై ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments