Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ - సెహ్వాగ్ రికార్డును బద్ధలుకొట్టిన శర్మ - ధవాన్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (16:20 IST)
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ - శిఖర్ ధావన్‌లు సరికొత్త రికార్డును నెలకొల్పారు. కొన్ని రోజులుగా పెద్ద భాగస్వామ్యాలు ఏవీ నెలకొల్పని ఈ జోడీ.. నాలుగో వన్డేలో సెంచరీ భాగస్వామ్యాలను అందుకుంది. రోహిత్, ధావన్‌లకు ఇది 15వ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ కావడం విశేషం. అంతేకాదు ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఈ జోడీ వెయ్యి పరుగులు చేసింది. 
 
ఈ క్రమంలో లెజెండరీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్ రికార్డును కూడా రోహిత్, ధావన్ జోడి అధికమించారు. ఈ ఇద్దరూ ఇప్పటివరకు 4,387 పరుగులు చేశారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికీ సచిన్, గంగూలీ జోడీయే టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ జోడీ 176 ఇన్నింగ్స్‌లో 8,227 పరుగులు చేసింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. మొత్తం 92 బంతులను ఎదుర్కొన్న రోహిత్ రెండు సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 103.26 స్ట్రైక్‌తో 95 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవాన్ మాత్రం సెంచరీతో వీరవిహారం చేశాడు. 
 
ధావన్ 115 బంతులను ఎదుర్కొన్న ధవాన్... 3 సిక్స్‌లతో, 18 ఫోర్ల సాయంతో 124.34 స్ట్రైక్‌ రేటుతో 143 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యంగా 193 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments