వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించేందుకు వస్తుంది. ఈ పర్యటనలో వన్డే సిరీస్తో పాటు టీ20 మ్యాచ్లను ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా జట్లను ప్రకటిచింది. వన్డే, టీ20 జట్లను వేర్వేరుగా ప్రకటించింది.
ఇందులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా, 21 యేళ్ళ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటన సమయంలో జట్టుకు పూర్తిగా దూరమైన రోహిత్ శర్మకు తిరిగి జట్టులో చోటు కల్పించి, సారథ్య బాధ్యతలను అప్పగించారు. అలాగే, రాజస్థాన్ హిట్టర్ దీపక్ హుడాకు కూడా చోటు కల్పించారు.
మరోవైపు, హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. పేసర్లు బుమ్రా, షమీలు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో జట్టులోకి ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్కు వన్డే జట్టులోనూ, భువనేశ్వర్కు టీ20 జట్టులోనూ బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు.