Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరుగైన వైద్యం కోసం ముంబైకు రిషబ్ పంత్.. బీసీసీఐ ప్యానెల్ సమీక్ష

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (14:26 IST)
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత జాతీయ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ముంబైకు తరలించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, అక్కడ వీలుపడకపోతే మరింత మెరుగైన వైద్యం కోసం విదేశానికి తరలించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకు చెందిన వైద్యుల ప్యానెల్ రిషబ్ పంత్ మెడికల్ రిపోర్టులను ఎగ్జామిన్ చేయనుంది. 
 
కాగా, డిసెంబరు 30వ తేదీన రూర్కీ జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోకాలులో లిగమెంట్ తెగిపోయింది. నుదురు, వీపు భాగాలపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడికి డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, మెరుగైన చికిత్స కోసం పంత్‌ను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించాలని బీసీసీఐ భావిస్తుంది. 
 
అంతేకాకుండా, బీసీసీఐ ప్యానెల్ వైద్యులు రిషబ్ పంత్‌ వైద్య రిపోర్టులను పరిశీలించి, అతడి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన చికిత్స కోసం పంత్‌ను విదేశానికి తరలించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, లండన్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు. పంత్ మళ్లీ బరిలోకి దిగాలంటే అతని మోకాలి లిగమెంట్ సమస్య పూర్తిగా నయం కావాల్సివుంది. ఈ విషయంలోనే పంత్‌కు మెరుగైన వైద్యం అందించాలన్న తలంపులో బీసీసీఐ ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

కాచిగూడ రైల్వే స్టేషనులో వాంతులు, ఇంటికెళ్లి సూసైడ్ చేసుకున్న మహిళా టెక్కీ

Woman: పల్నాడులో ఘోరం.. భర్తను బంధువులతో కలిసి చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న కుమారుడు మిథన్ రెడ్డికి పెద్దిరెడ్డి భోజనం (video)

మహిళ పర్సును కొట్టేసిన దొంగలు.. ఏటీఎం కార్డుతో రూ.40వేలు దొంగలించారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

తర్వాతి కథనం
Show comments