Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్‌కు కరోనా నెగెటివ్ : జట్టులో చేరిన వికెట్ కీపర్

Webdunia
గురువారం, 22 జులై 2021 (12:29 IST)
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న క‌రోనా బారిన ప‌డిన అత‌డు.. 10 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆ త‌ర్వాత నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్‌గా తేల‌డంతో అత‌డు టీమ్‌ బ‌యో బ‌బుల్‌లోకి వెళ్లాడు. ఈ విష‌యాన్ని గురువారం ఉద‌యం ఓ ట్వీట్‌లో బీసీసీఐ వెల్ల‌డించింది. ఆగ‌స్ట్ 4న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం పంత్ అందుబాటులో ఉండ‌నున్నాడు.
 
అయితే పంత్ టీమ్‌తో చేరినా.. మ‌రో వికెట్ కీప‌ర్ వృద్ధిమాన్ సాహాతోపాటు అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ ఇంకా ఐసోలేష‌న్‌లోనే ఉన్నారు. ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఐసోలేష‌న్‌లో ఉండటంతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments