రిషబ్ పంత్‌కు కరోనా నెగెటివ్ : జట్టులో చేరిన వికెట్ కీపర్

Webdunia
గురువారం, 22 జులై 2021 (12:29 IST)
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న క‌రోనా బారిన ప‌డిన అత‌డు.. 10 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆ త‌ర్వాత నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్‌గా తేల‌డంతో అత‌డు టీమ్‌ బ‌యో బ‌బుల్‌లోకి వెళ్లాడు. ఈ విష‌యాన్ని గురువారం ఉద‌యం ఓ ట్వీట్‌లో బీసీసీఐ వెల్ల‌డించింది. ఆగ‌స్ట్ 4న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం పంత్ అందుబాటులో ఉండ‌నున్నాడు.
 
అయితే పంత్ టీమ్‌తో చేరినా.. మ‌రో వికెట్ కీప‌ర్ వృద్ధిమాన్ సాహాతోపాటు అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ ఇంకా ఐసోలేష‌న్‌లోనే ఉన్నారు. ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఐసోలేష‌న్‌లో ఉండటంతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదిగో ఈ 50 వేలు తీసుకుని చెప్పులు షాపు పెట్టుకో: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాయం

అలాంటి అపవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం మనం తిన్నామా?: దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన

సొంత చెల్లిని పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన సోదరుడు.. కోర్టు తీర్పు ఇదే...

నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లేడీ కానిస్టేబుల్.. ఆపై సస్పెన్షన్... ఎందుకంటే...

మహిళలకు మరో శుభవార్త చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ.. ఆ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది సాయికుమార్, వేదిక హారర్ థ్రిల్లర్ జంగిల్.సిద్దం

Viswak Sen: ఉర్రూతలూగించేలా ఫంకీ మాస్ గీతం యమ యమ్మ

Nani: నాని ది ప్యారడైజ్ షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏం చేశాడు

Haigh: నలుగురు వ్యక్తుల హై కోరికల నేపథ్యంతో హై మూవీ టీజర్‌

తర్వాతి కథనం
Show comments