Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24 గంటల్లో కొత్తగా 41 వేల కరోనా పాజిటివ్ కేసులు

24 గంటల్లో కొత్తగా 41 వేల కరోనా పాజిటివ్ కేసులు
, గురువారం, 22 జులై 2021 (09:46 IST)
దేశంలో కొత్తగా మరో 41 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో తెలిపింది. 
 
అలాగే, తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 4,18,987 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇకోపోతే, ప్రస్తుతం దేశంలో 4,09,394 యాక్టివ్‌ కేసులు ఉండగా, వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 41,78,51,151 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీల కేసులు 1.31 శాతం ఉన్నాయని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.41శాతంగా ఉందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఓకే