Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా రమీజ్ రాజాకు ఉద్వాసన

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (13:47 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస ఓటములను చవిచూస్తుంది. ఈ జట్టు వైఫల్యాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మెడకు చుట్టుకుంది. చివరకు ఆయన పదవికి ఎసరు పెట్టింది. రమీజ్ రాజాను క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని ఆదేశాలు జారీచేశారు. అదేసమయంలో కొత్త ఛైర్మన్‌గా నజీమ్ సేథీని నియమించారు. రమీజ్ రాజా 15 నెలల పాటు పీసీబీ ఛైర్మన్‌గా ఉన్నారు. 
 
ఇదిలావుంటే, పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఆడిన క్రికెట్ సిరీస్‌లతో పాటు విదేశీ గడ్డలపై జరిగిన సిరీస్‌లలో కూడా ఓడిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ సిరీస్‌లో పిచ్‌ల తయారీపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది రమీజ్ రాజా ఉద్వాసనకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 
 
పాకిస్థాన్ ప్రధాని పీసీబీకి ప్యాట్రన్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. దీంతో రమీజాను తొలగించి, ఆయన స్థానంలో నజీమ్ సేథీకి బాధ్యతలు అప్పగించినట్టు ప్రధాని పేరుమీద విడుదలైన ఓ ప్రకటన వెల్లడించింది. 
 
మరోవైపు, నజీమ్ సేథీ పీసీబీ సీఈవోగా 2013 నుంచి 2018 వరకు సేవలు అందించారు. అయితే 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త కాకుండా వేరే వ్యక్తి పట్ల ప్రేమ నేరం కాదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు

Jayalalithaa-జయలలిత ఆస్తుల స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభం..

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments