Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా రమీజ్ రాజాకు ఉద్వాసన

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (13:47 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస ఓటములను చవిచూస్తుంది. ఈ జట్టు వైఫల్యాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మెడకు చుట్టుకుంది. చివరకు ఆయన పదవికి ఎసరు పెట్టింది. రమీజ్ రాజాను క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని ఆదేశాలు జారీచేశారు. అదేసమయంలో కొత్త ఛైర్మన్‌గా నజీమ్ సేథీని నియమించారు. రమీజ్ రాజా 15 నెలల పాటు పీసీబీ ఛైర్మన్‌గా ఉన్నారు. 
 
ఇదిలావుంటే, పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఆడిన క్రికెట్ సిరీస్‌లతో పాటు విదేశీ గడ్డలపై జరిగిన సిరీస్‌లలో కూడా ఓడిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ సిరీస్‌లో పిచ్‌ల తయారీపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది రమీజ్ రాజా ఉద్వాసనకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 
 
పాకిస్థాన్ ప్రధాని పీసీబీకి ప్యాట్రన్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. దీంతో రమీజాను తొలగించి, ఆయన స్థానంలో నజీమ్ సేథీకి బాధ్యతలు అప్పగించినట్టు ప్రధాని పేరుమీద విడుదలైన ఓ ప్రకటన వెల్లడించింది. 
 
మరోవైపు, నజీమ్ సేథీ పీసీబీ సీఈవోగా 2013 నుంచి 2018 వరకు సేవలు అందించారు. అయితే 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments