Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను అంత మాట అనలేదే.. నా మాటలను వక్రీకరించారు: రమీజ్ రాజా

Advertiesment
cricket stadium
, మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (11:04 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 
 
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వచ్చే సీజన్ నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తామని.. అప్పుడు ఐపీఎల్‌కు ఎవరు వెళ్తారో చూస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 
 
దీనిపై విమర్శలు రావడంతో.. తాజాగా రమీజ్​ రాజా స్పందించాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను అలా అనలేదని అన్నాడు.
 
భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు తెలుసునని.. పీఎస్​ఎల్​ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు తమ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. 
 
ఈ క్రమంలోనే వేలం ప్రక్రియను తీసుకువద్దామనుకున్నాం. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ శాలరీతో అమ్మ కోసం ఇల్లు కొంటా: ఈ వైభవ్ అరోరా ఎవరు?