Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు కోచ్‌ పదవిని సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (15:58 IST)
భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిని మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగుతున్నారు. ఆయన ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కోచ్‌ ఎవరనే అంశంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. 
 
ఈ అంశంలో అనిల్ కుంబ్లే తదితరుల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. తాజాగా రాహుల్ ద్రవిడ్‌కు ఈ పదవి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వార్తలొచ్చాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
 
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ద్రవిడ్ భుజాలకెత్తుకొని ఉన్నాడు. దీంతోపాటు అండర్‌-19 భారత జట్టు, ఇండియా ఎ జట్లకు కోచ్‌గా ఉన్నాడు. 
 
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తప్పుకోగానే కోచ్‌ పదవిని ద్రవిడ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావించింది. కానీ ద్రవిడ్ మాత్రం దీనికి సుముఖంగా లేనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగియగానే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ కూడా ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments