Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌‌ క్రికెటర్లు జమ్మూకాశ్మీర్‌ జట్టుకు ఆడొచ్చు: రాయ్‌‌

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (13:25 IST)
కొత్తగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) లడఖ్‌‌కు చెందిన ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్‌‌ ఆడే అవకాశం కల్పిస్తామని బీసీసీఐ కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌ (సీఓఏ) హెడ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ తెలిపారు. లడఖ్‌‌ ప్లేయర్లు..  జమ్మూ కాశ్మీర్‌‌ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతిస్తామని చెప్పారు. ‘కొత్తగా ఏర్పాటైన లడఖ్‌‌ యూటీకి సపరేట్‌‌ క్రికెట్‌‌ బాడీని ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని స్పష్టం చేశారు.
 
ఈ ప్రాంతానికి చెందిన ప్లేయర్లు గతంలో మాదిరిగా బీసీసీఐ కాంపిటిషన్లలో జమ్మూ కాశ్మీర్‌‌కు ప్రాతినిథ్యం వహించొచ్చని తెలిపారు. మరో యూటీ పుదుచ్చేరి మాదిరిగా లడఖ్‌‌ను కూడా బీసీసీఐ ఓటింగ్‌‌ మెంబర్‌‌ను చేసే విషయం గురించి కూడా ఇప్పుడు చర్చలు జరపడం లేదన్నారు. 
 
జమ్మూ కాశ్మీర్‌‌లో ప్రస్తుత పరిస్థితి గురించి బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడం లేదని, త్వరలోనే అంతా సర్ధుకుంటుందన్నారు. గతేడాది మాదిరిగా జమ్మూ కాశ్మీర్‌‌ తన హోమ్‌‌ మ్యాచ్‌‌లను శ్రీనగర్‌‌లో ఆడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments