Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ విజయం

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (00:33 IST)
ఐపీఎల్ 2025 పోటీల్లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 16 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఘోరంగా తడబడి 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో అంగ్ క్రిష్ రఘువంశీ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 
 
రహానే 17, అండ్రీ రస్సెల్ 17 చొప్పున పరుగులు చేశారు. సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన కేకేఆర్‌ను యజ్వేంద్ర చాహల్ కోలుకోలేని దెబ్బతీశాడు. నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీయగా, మార్కో యాన్సెన్ మూడు వికెట్లు నేలకూల్చాడు. మ్యాక్స్‌వెల్, అర్ష్ దీప్, బార్ట్‌లెట్‌లో తలో వికెట్ పడగొట్టారు. 
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభ్‌సిమ్రన్ 30, ప్రియాంశ్ 22 మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3, వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2, నోకియా, వైభవ్‌లు తలో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments