ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌కు భంగపాటు.. విజేతగా శ్రీలంక

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (07:58 IST)
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బోల్తాపడింది. దీంతో ఆసియా కప్ విజేతగా శ్రీలంక విజయం సాధించింది. ఈ విజయంతో ఆరోసారి లంకేయులు ఆసియా కప్‌ను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 171 పరుగుల విజయలక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన పాక్ ఆటగాళ్లు 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ హసరంగ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు నేలకూల్చి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా లంకేయులు ఆరోసారి ఆసియా విజేతలుగా నిలిచారు. 
 
శ్రీలంక జట్టు గతంలో 1986, 1997, 2004, 2008, 2014లలో విజేతగా నిలిచింది. ఇపుడు మరోమారు గెలుపొందింది. అయితే, అత్యధిక ఆసియా కప్ టైటిల్స్ సాధించిన జట్టుకా భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. టీమిండియా మొత్తం ఏడుసార్లు విజేతగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments