Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ప్రపంచ కప్‌.. భారత్ గెలవాలని ప్రార్థిస్తున్న పాకిస్థాన్..!

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (19:06 IST)
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జర్నీకి అడ్డుకట్ట పడిందనే చెప్పాలి. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతుల్లో ఓడిన పాక్.. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో ఓటమిని చవిచూసింది. 
 
దీంతో పాక్ సెమీస్ అవకాశాలను క్లిష్టతరంగా మారాయి. బాబర్ సేన సెమీఫైనల్స్‌కు చేరాలంటే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో.. ఇక ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. 
 
అంతేకాకుండా నెట్ రన్‌రేటు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ వైఫల్యాన్ని చూసి నవ్వుకున్న పాకిస్థానీలు.. ఇప్పుడు భారత్ గెలవాలంటూ కోరుకుంటున్నారు.
 
పాక్ సెమీస్ చేరాలంటే.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్ రేట్‌తో విజయం సాధించాలి. అటు సౌతాఫ్రికాను భారత్ ఓడించాలి. ఇక జింబాబ్వే తన తదుపరి మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడాలి. అదే సమయంలో బంగ్లాదేశ్ మరో మ్యాచ్‌లో ఓడిపోవాలి. అంటే భారత్ ఈ మూడు జట్లు సౌతాఫ్రికా, బంగ్లా, జింబాబ్వేను ఓడించాలి. 
 
ఇక సూపర్ 12లో భారత్ గనుక ఓడితే పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్టే. అందుకే ఇప్పుడు భారత్ గెలవాలని పాక్ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

నిత్యామీనన్ ను స్పూర్తిగా తీసుకుని తమ్ముడులో నటించా : వర్ష బొల్లమ్మ

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

వెండితెరపై కళ్యాణ్ బాబు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు : మెగాస్టార్ చిరంజీవి

తర్వాతి కథనం
Show comments