Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రావిడ్‌ను కాపీకొడుతున్న పాకిస్థాన్ (video)

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:10 IST)
భారత క్రికెట్ జట్టులో 'ది వాల్‌'గా పేరొందిన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత క్రికెట్‌కు తనవంతు సేవలు అందిస్తున్నాడు. ఫలితంగా మెరికల్లాంటి యువ క్రికెటర్లు తయారవుతున్నారు. భారత జూనియర్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉంటున్న రాహుల్ ద్రావిడ్.. అనేక మంది యువ క్రికెటర్లను సానబట్టి అత్యుత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో సీనియర్ జట్టులో సీనియర్ లేరు అనే లోటు ఎక్కడా కనిపించడం లేదు. 
 
రాహుల్ ద్రావిడ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న పాకిస్థాన్ కూడా ఇదే మార్గాన్ని అనుసరించనుంది. మాజీ క్రికెటర్లను రంగంలోకి దించి యువ క్రికెటర్లను సానబెట్టాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనికోసం యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్‌లాంటి మాజీ క్రికెటర్ల వైపు చూస్తున్నది. గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించిన యూనిస్ ఖాన్‌ను పాకిస్థాన్ అండర్ 19 టీమ్ కోచ్, మేనేజర్‌గా నియమిస్తారన్న వార్తలు ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి. 
 
పాకిస్థాన్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు, 10 వేల పరుగులు మైలురాయి అందుకున్న తొలి ప్లేయర్‌గా యూనిస్ ఖాన్‌కు పేరుంది. అలాంటి క్రికెటర్ తనకు కోచింగ్‌పై ఆసక్తి ఉందని కూడా చెప్పాడు. అయితే ఈ విషయంలో బోర్డు తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని మెలిక పెట్టాడు. ఆస్ట్రేలియా జట్టు కూడా రాడ్నీ మార్ష్, అలన్ బోర్డర్, రికీ పాంటింగ్‌లాంటి మాజీ క్రికెటర్ల సేవలను వినియోగించుకుంది. 
 
అలాగే ఇండియా కూడా ద్రవిడ్‌ను రంగంలోకి దించింది. భారత్ అండర్ 19, ఇండియా ఏ టీమ్స్‌కు కోచ్‌గా విజయవంతమయ్యాడు. అతని కోచింగ్‌లోనే గతేడాది ఇండియా అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ సెలక్టర్‌గా, పాంటింగ్ ప్రస్తుత నేషనల్ టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు. అందుకే పాక్ కూడా మాజీలను రంగంలోకి దింపాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments