Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాఫ్ట్ సిగ్నల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (12:54 IST)
స్వదేశంలో భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులో ఆటగాళ్లు ఔటా..? నాటౌటా? అనే విషయంలో థర్డ్ అంపైర్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌పై చర్చ సాగుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
వచ్చే నెల 9 నుంచి జరగనున్న ఐపీఎల్‌లో ఫీల్డ్‌లో ఉండే అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌ను పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. ఐపీఎల్ నిబంధనల్లోని అపెండిక్స్ డీ-క్లాస్ 2.2.2 ప్రకారం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
 
కాగా, ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 సిరీస్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ని ఇంగ్లండ్ అటగాడు డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ పట్టుకోగా, ఆ బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. 
 
అయితే, గ్రౌండ్‌లో ఉన్న అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌గా అవుట్‌ను ప్రకటించడంతో రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని థర్డ్ అంపైర్ దాన్ని అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
 
దీంతో ఐపీఎల్‌లో ఇటువంటి తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని భావించిన బీసీసీఐ, ఫీల్డ్ అంపైర్‌తో సంబంధం లేకుండా, తనకు రిఫర్ చేసిన బాల్స్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments