దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది.
అయితే, న్యూజిలాండ్ జట్టు తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా, ఆసీస్కిది రెండో ఫైనల్ కావడం గమనార్హం. గత 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన కివీస్.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని భావిస్తుంది.
ఇప్పటికే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్గా నిలిచిన విలియమ్సన్ సేన అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆసీస్.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే గట్టిపట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్ కోసం కంగారులు జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. పాకిస్థాన్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆడిన జట్టునే బరిలోకి దించారు. అయితే, కివీస్ జట్టులో గాయం కారణంగా కాన్వే తప్పుకోగా, అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్ చేరాడు.