Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యాతో విడాకులు : నటాషా వెల్లడి!!

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (13:42 IST)
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, తాను విడిపోయినట్టు ఆయన భార్య నటాషా శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. నిజానికి నటాషా తాను విడిపోతున్నట్టు హార్దిక్ పాండ్యా గురువారం రాత్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నటాషాతో నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికినట్లు అందులో పేర్కొన్నారు. భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. "పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు పాండ్యా వెల్లడించారు. 
 
ఇటీవల తన కుమారుడు అగస్త్యను తీసుకొని నటాషా ముంబై నుంచి సెర్బియాకు వెళ్లిపోయిన విషయం తెల్సిందే. నటాషా ముంబై నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఇదేసమయంలో తాము విడాకులు తీసుకున్నట్లు పాండ్యా ప్రకటించారు.
 
'4 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం. కలిసి ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం. ఇద్దరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో మధుర క్షణాల అనంతరం, కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠిన నిర్ణయమే' అని పేర్కొన్నారు.
 
అగస్త్య తమ ఇద్దరితోనూ ఉంటాడని, అతని సంతోషం కోసం మేం తల్లిదండ్రులుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కష్టమైన సమయంలో తమ గోప్యతకు సహకరించాలని, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. 
 
ఏడేళ్ల క్రితం పాండ్యా-నటాషాకు మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. వీరు ప్రేమలో ఉన్నట్లు 2018లో మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. 2020లో తాము ప్రేమించుకుంటున్నట్లు పాండ్యా ప్రకటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. 
 
అలాగే, తన పుట్టినిల్లు అయిన సెర్బియాకు చేరుకున్న నటాషా కూడా శుక్రవారం తమ విడాకుల గురించి అధికారికంగా వెల్లడించారు. అలాగే, తన పేరు నుంచి హార్దిక్ పాండ్యా పేరును తొలగించారు. అలాగే, సోషల్ మీడియాలో హార్దిక్ ఫోటోలను కూడా తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments