Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : శ్రీలంకకు షాకిచ్చిన పసికూన నమీబియా

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (16:07 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం నుంచి ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా, తొలి రౌండ్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా ఆదివారం శ్రీలంక జట్టు క్రికెట్ పసికూన నమీబియాతో తలపడింది. అయితే, లంకేయులకు నమీబియా క్రికెటర్లు తేరుకోలేని షాకిచ్చారు. 55 పరుగుల తేడాతో లంక జట్టును చిత్తు చేశారు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన నమీబియా జట్టు 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక నమీబియా జట్టు చతికిలపడింది. 108 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించలేకపోయారంటే ఎంత పేలవంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. 
 
ఇదిలావుంటే, ఆదివారం నుంచి ప్రారంభమైన తొలి రౌండ్ పోటీల్లో మొతంత 8 జట్లు పాల్గొంటాయి. జీలాంగ్‌, హోబర్ట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్‌లు. 
 
గ్రూప్‌-ఎలో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్‌-బిలో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే పోటీపడనున్నాయి. 
 
గ్రూప్‌లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్‌-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్‌-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్‌ జరుగుతుంది.
 
గతేడాది టోర్నీ మాదిరే టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఎదుర్కోబోతోంది. ఈనెల 23న ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 90 వేలకు పైగా ప్రేక్షకులు ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments