Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : శ్రీలంకకు షాకిచ్చిన పసికూన నమీబియా

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (16:07 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం నుంచి ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా, తొలి రౌండ్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా ఆదివారం శ్రీలంక జట్టు క్రికెట్ పసికూన నమీబియాతో తలపడింది. అయితే, లంకేయులకు నమీబియా క్రికెటర్లు తేరుకోలేని షాకిచ్చారు. 55 పరుగుల తేడాతో లంక జట్టును చిత్తు చేశారు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన నమీబియా జట్టు 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక నమీబియా జట్టు చతికిలపడింది. 108 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించలేకపోయారంటే ఎంత పేలవంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. 
 
ఇదిలావుంటే, ఆదివారం నుంచి ప్రారంభమైన తొలి రౌండ్ పోటీల్లో మొతంత 8 జట్లు పాల్గొంటాయి. జీలాంగ్‌, హోబర్ట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్‌లు. 
 
గ్రూప్‌-ఎలో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్‌-బిలో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే పోటీపడనున్నాయి. 
 
గ్రూప్‌లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్‌-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్‌-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్‌ జరుగుతుంది.
 
గతేడాది టోర్నీ మాదిరే టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఎదుర్కోబోతోంది. ఈనెల 23న ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 90 వేలకు పైగా ప్రేక్షకులు ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

Ahmedabad Plane Crash: ఏపీ వార్షిక విజయోత్సవాలు వాయిదా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments