Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం హంతకులమో, టెర్రరిస్టులమో అన్న భావన కలిగింది : ఎంఎస్ ధోనీ

భారత మీడియాపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫైర్ అయ్యాడు. 2007 వన్డే వరల్డ్‌క్‌పలో భారత్‌ పేలవ ప్రదర్శనపై దేశంలోని ఓ వర్గం మీడియా స్పందించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మీడియా వ్యవహారశ

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:39 IST)
భారత మీడియాపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫైర్ అయ్యాడు. 2007 వన్డే వరల్డ్‌క్‌పలో భారత్‌ పేలవ ప్రదర్శనపై దేశంలోని ఓ వర్గం మీడియా స్పందించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మీడియా వ్యవహారశైలి తాను హంతకుడినో లేక ఉగ్రవాదినో అన్న భావన కలిగేలా చేసిందన్నాడు. తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఎమ్‌ఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమా ప్రమోషన్‌లో భాగంగా న్యూయార్క్‌ సిటీలో జరిగిన ఈవెంట్‌లో మహీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
 
నాడు రాహుల్‌ ద్రావిడ్‌ నేతృత్వంలోని జట్టు 2007 వరల్డ్‌ కప్‌లో ఆరంభ మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ చేతిలో, ఆపై శ్రీలంక చేతిలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. దీంతో, వెస్టిండీస్‌ నుంచి జట్టు నిరాశగా స్వదేశానికి చేరుకోవడాన్ని ధోనీ గుర్తు చేసుకున్నాడు. పటిష్ట భద్రత మధ్య ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన తమను మీడియా చుట్టు ముట్టిందన్నాడు. జట్టు సభ్యులను మీడియా ప్రతినిధులు వెంబడించారన్నాడు. అప్పుడు మీడియా వ్యవహరించిన తీరు తనను ఒక మనిషిగా, క్రికెటర్‌గా చాలా ప్రభావితం చేసిందని చెప్పాడు. 
 
మీడియా కార్లు పెద్ద పెద్ద లైట్లు అమర్చిన కెమెరాలతో మమ్మల్ని అనుసరిస్తున్నాయి. మా వాహనం వెంటపడుతున్నాయి. వాళ్లను చూస్తే మేమేదో పెద్ద నేరం చేసినట్టుగా అనిపించింది. మేం హంతకులమో, టెర్రరిస్టులమో అన్న భావన నాలో కలిగింది. కొద్ది దూరం తర్వాత మేం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాం. మేం కావాలనే అక్కడికి వెళ్లాం. 15-20 నిమిషాలు అక్కడ కూర్చొని మా కార్లలో ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నాం. ఈ తతంగం అంతా నాపై చాలా ప్రభావం చూపింద’ని చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

తర్వాతి కథనం
Show comments