Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో మైలురాయికి చేరువలో ధోనీ... తొలి వికెట్ కీపర్‌గా...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (17:24 IST)
మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో మైలురాయి చేరనుంది. అయితే, ఈ రికార్డును చేరుకోవాలంటే ధోనీ మరో 33 పరుగులు చేయాల్సివుంది. అలా చేసిన పక్షంలో అన్ని ఫార్మెట్‌లలో కలిపి 17 వేల పరుగులు చేసిన భారతీయ క్రికెటర్ల జాబితాలో ధోనీ చేరుతాడు. ఇప్పటివరకు ఆ ఖాతాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఉన్నారు. మరెవ్వరూ ఈ అరుదైన ఫీట్‌ను అందుకోలేక పోయారు. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈ జట్టుతో భారత్ ఐదు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. అయితే, ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టును ధోనీ గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 59 (నాటౌట్) పరుగులే చేసినప్పటికీ... కేదార్ జాదవ్ (81 నాటౌట్)తో కలిసి అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ నేపథ్యంలో అన్ని ఫార్మెట్లలో కలిపి 17 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు ధోనీ 33 పరుగులు చేస్తే సరిపోతుంది. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులు చేయగా, ద్రావిడ్ 24,208 రన్స్, కోహ్లీ 19,453 (నాటౌట్), సౌరవ్ గంగూలీ 18,575, సెహ్వాగ్ 17,253 చొప్పున పరుగులు చేశారు. 
 
వీరి సరసన చేరేందుకు 33 పరుగుల దూరంలో ఉన్న ధోనీ... ఇప్పటివరకు టెస్టుల్లో 4,876 పరుగులు, వన్డేల్లో 10,474 పరుగులు, ట్వంటీ20ల్లో 1,617 చొప్పున మొత్తం 16967 పరుగులు చేశారు. అంటే 17 వేల రికార్డును చేరుకునేందుకు మరో 33 పరుగుల దూరంలో నిలిచాడు. ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు కలిగిన ధోనీ.. మరో మూడు వన్డే మ్యాచ్‌లు ఉన్నందుకు ఈ రికార్డును కూడా ఆస్ట్రేలియా పర్యటనలోనే పూర్తి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments