Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ రికార్డ్‌ను సృష్టించిన మిథాలీ రాజ్.. గప్తిల్‌ను కూడా వెనక్కి నెట్టేసింది..

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (17:10 IST)
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భారత జట్టు పరుగుల వరద కురిపిస్తోంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాపై హర్మన్ అదిరిపోయే సెంచరీ సాధించగా.. ఐర్లాండ్‌ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు విజయం అందించింది. 
 
ఈ మ్యాచ్‌లో 51 పరుగులు సాధించిన మిథాలీ తన కెరీర్‌లో 17వ అర్థ శతకాన్ని పూర్తి చేసుకుంది. ఈ స్కోర్‌‌తో మిథాలీ రాజ్ అంతర్జాతీయ మహిళల క్రికెట్ విభాగంలోనే కాకుండా పురుషుల విభాగంలోనూ దిగ్గజ క్రికెటర్లను వెనక్కి నెట్టింది. 
 
పురుషుల అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (2207)తో అగ్రస్థానంలో వుండగా, అతడి తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ వున్నాడు. కానీ మిథాలీ ఇదివరకే పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి రికార్డులను బ్రేక్ చేస్తూ.. టీ-20ల్లో 2232 పరుగులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ట్వంట-20 క్రికెట్ చరిత్రలో కివీస్ బ్యాట్స్‌మెన్ మార్తిన్ గప్తిల్ 2271 పరుగులతో వరల్డ్ నెంబర్ వన్‌గా వుంటే.. మిథాలీ 37.43 సగటుతో 2283 పరుగులతో గప్తిల్‌ని కూడా వెనక్కి నెట్టేసింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments