Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల క్రికెట్‍లో సరికొత్త రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (15:53 IST)
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారత వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఫార్మాట్‌లో ఏడు వేల పరుగులు చేశారు. ఇది సరికొత్త మైలురాయి. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచారు. 
 
ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో మిథాలి(45; 71 బంతుల్లో నాలుగు ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ క్రమంలోనే వన్డేల్లో కొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ ట్వీట్‌ చేసి మిథాలిని అభినందించింది.
 
'అద్భుతమైన క్రికెటర్‌ మిథాలి. టీమ్‌ఇండియా సారథి వన్డేల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఆమె ఎంతో ఉత్తమమైన క్రికెటర్‌’ అని ప్రశంసించింది. 
 
మరోవైపు ఇదే ఫార్మాట్‌లో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఇదివరకు మిథాలి సత్తా చాటారు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ 5,992 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు. 
 
కాగా, ఇదే దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మిథాలి 36 పరుగులు చేసి అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మైలురాయి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆమె రెండో స్థానంలో నిలవగా, ఎడ్వర్డ్స్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments