Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ టీ-20: నేపాల్ 21 పరుగులే.. 99 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 టోర్నీలో భారత మహిళా జట్టు గెలుపును నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్‌... ఐదింట్లోను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా నేపాల

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:37 IST)
ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 టోర్నీలో భారత మహిళా జట్టు గెలుపును నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్‌... ఐదింట్లోను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా నేపాల్‌తో తలపడిన భారత మహిళా క్రికెట్ జట్టు 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు సాధించింది. 
 
భారత మహిళా జట్టులో శిఖా పాండే అద్భుత ఇన్నింగ్స్ ద్వారా 39 పరుగులు సాధించింది. ఫలితంగా 121 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్, భారత వుమెన్స్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. దీంతో నేపాలీ వుమెన్స్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 16.3ఓవర్లలో నేపాల్‌ కేవలం 21పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్ల ధాటికి నేపాల్‌ క్రీడాకారులందరూ సింగిల్‌ డిజిట్‌కే ఔటయ్యారు.
 
ఈ మ్యాచ్‌లో సరిత మగర్‌ అనే క్రీడాకారిణి చేసిన ఆరు పరుగులే వ్యక్తిగతంగా నేపాల్‌ క్రీడాకారిణుల్లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. నలుగురు క్రీడాకారిణులు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. భారత్‌ తరఫున పూనమ్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన, పాటిల్‌ చెరో రెండు వికెట్లు, పాండే, జోషి, బిస్తా తలో వికెట్‌ తీసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments