Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాహూ సర్వేలో టాప్‌లో నిలిచిన పీవీ సింధు.. మహిళా సెలెబ్రిటీల్లో సన్నీదే తొలిస్థానం..

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు యాహూ నిర్వహించిన సర్వేలో రాజకీయనాయకులను, బాలీవుడ్‌ నటులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సోషల్‌మీడియాలో అత్యధికంగా

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (13:30 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు యాహూ నిర్వహించిన సర్వేలో రాజకీయనాయకులను, బాలీవుడ్‌ నటులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సోషల్‌మీడియాలో అత్యధికంగా శోధించిన పదం 'రియో ఒలింపిక్స్‌'కాగా తర్వాతి స్థానంలో 'ఐపీఎల్‌-2016' నిలిచింది. ఎక్కువగా వెదికిన మహిళా సెలెబ్రిటీల్లో తొలిస్థానాన్ని వరసగా ఐదో సంవత్సరం కూడా సన్నీలియోన్ నిలబెట్టుకుంది.
 
ఇక 2016లో దేశంలో వివిధ రంగాల్లో అత్యధికంగా వార్తల్లో నిలిచిన వ్యక్తులపై నిర్వహించిన ఈ సర్వేలో పీవీ సింధు ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ద్వారా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌ విభాగంలో తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక టాప్ 20లో సాక్షిమాలిక్ తదితర క్రీడాకారులు స్థానం సంపాదించారు. 
 
క్రికెటర్లను సైతం వెనక్కి ఇతర క్రీడల్లో రాణించిన ఆటగాళ్లు సర్వేలో ముందుకు దూసుకెళ్లారు. ఇక క్రికెటర్ల సంగతికి వస్తే టాప్‌ టెన్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఎమ్‌ఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ స్థానం దక్కించుకున్నారు. ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే... సోషల్‌మీడియాలో అత్యధికంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురించి ఎక్కువమంది శోధించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండో స్థానంలో నిలిచారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments