Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ టెస్టు: వరుసగా పెవిలియన్ క్యూ కట్టిన బ్యాట్స్‌మెన్లు.. 204 పరుగులకే భారత్ ఆలౌట్..

విశాఖ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్లు వెంట వెంటనే నేలకూలాయి. ఫలితంగా 204 పరుగులకే భారత్ ఆలౌటైంది. దీంతో మొత్తం 404 పరుగుల లీడ్ సాధించింది. నాలుగో రోజు 98/3 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆటను క

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (13:58 IST)
విశాఖ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్లు వెంట వెంటనే నేలకూలాయి. ఫలితంగా 204 పరుగులకే భారత్ ఆలౌటైంది. దీంతో మొత్తం 404 పరుగుల లీడ్ సాధించింది. నాలుగో రోజు 98/3 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించిన టీమిండియా మరో 106 పరుగులు జోడించింది. తొలి సెషన్ ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. 
 
ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే(26) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. ఆపై భారత బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ క్యూ కట్టారు. రహానేకు తర్వాత పది పరుగుల వ్యవధిలో రవి చంద్రన్ అశ్విన్(7)అవుటయ్యాడు. మరికొద్దిసేపటికే వృద్థిమాన్ సాహా(2) పెవిలియన్ చేరారు. 130/6 తో కష్టాల్లో టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు కెప్టెన్ కోహ్లీ(81). అయినా ఫలితం లేకుండా పోయింది. 
 
రషీద్ బౌలింగ్‌లో ఏడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా, యూటీ యాదవ్ వెంట వెంటనే ఔటయ్యారు. దీంతో 204 పరుగులకే టీమిండియా అన్నీ వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్ చెరో నాలుగు వికెట్లు, అండర్సన్, అలీ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే పరిమితం అయ్యింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు సాధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

తర్వాతి కథనం
Show comments