Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గులేదా.. ప్రజలను మోసం చేసేందుకు నా పేరు వాడుకుంటారా?: సెహ్వాగ్

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (17:45 IST)
ట్విట్టర్లో ఛలోక్తులు, చమత్కారాలను కలిపి ట్వీట్ చేయడంలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దిట్ట. ఇతడు సామాజిక వెబ్ సైట్లలో ఎంతమేరకు హాస్యం పండిస్తాడో.. అంతకంతట కోపిష్టి కూడాను. తాజాగా ఓ ఘటనపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
 
రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రీయ లోక్ తంత్రిక్ పార్టీ ప్రకటనలకు సెహ్వాగ్‌ పేరును ఆయన అనుమతి లేకుండా వాడుకుంది. దుబాయ్‌లో జరుగుతున్న టీ-20ల్లో పాల్గొనే ఓ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు వ్యవహరిస్తున్న సెహ్వాగ్.. ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకుని మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు తన పేరును వాడుకోవడాన్ని వీరూ ఖండించాడు. 
 
తాను ప్రస్తుతం దుబాయ్‌లో వున్నానని, ఏ పార్టీతో తనకు సంబంధాలు లేవన్నాడు. ఏమాత్రం సిగ్గు లేకుండా ఎన్నికల ప్రచారం కోసం తన పేరు వాడుకున్నారు. ఇలా ప్రజలను మోసం చేసేందుకు తన పేరు వాడుకుంటున్నందుకు బాధగా వుంది. అధికారం కోసం ప్రజలను మోసం చేసేందుకు రాజకీయ పార్టీలు ఇలాంటి పనులు చేస్తున్నాయని.. వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments