Webdunia - Bharat's app for daily news and videos

Install App

జట్టులో ఉండి ఏం లాభం.. అందుకే వైదొలుగుతా...

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు యమ జోరుమీద ఉంది. కోహ్లీ సేన విజృంభణకు లంకేయులు బిత్తరపోతున్నారు. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌తో పాటు.. వన్డే సిరీస్‌లను కోల్పోయి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (19:06 IST)
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు యమ జోరుమీద ఉంది. కోహ్లీ సేన విజృంభణకు లంకేయులు బిత్తరపోతున్నారు. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌తో పాటు.. వన్డే సిరీస్‌లను కోల్పోయి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. సొంతగడ్డపై కూడా ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోతున్నారు. దీంతో శ్రీలంక క్రికెటర్లు తీవ్ర నిర్వేదంలో కూరుకునిపోయారు. అలాంటి వారిలో సీనియర్ పేసర్, కెప్టెన్ లసిత్ మలింగా. 
 
సొంత గడ్డపై భారత జట్టులో ఎదురైన వరుస వైఫల్యాలపై స్పందిస్తూ... భారత్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తన రిటైర్మెంట్ పై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. తన ప్రదర్శన సంతృప్తికరంగా లేకపోతే ఆటకు వీడ్కోలు పలకడమే బెటర్ అన్నాడు. గాయం కారణంగా 19 నెలల పాటు జట్టుకు దూరమయ్యానని... ఈ సిరీస్ తర్వాత ఎక్కడుంటానో చూద్దామన్నాడు. 
 
శరీరం సహకరిస్తే ఫర్వాలేదని... లేకపోతే జట్టులో ఉండిఏం ప్రయోజనమన్నాడు. ఫామ్‌‌ను అందిపుచ్చుకోలేక పోతే, సరిగ్గా బంతిని విసరలేకపోతే ఆటకు ఆనందంగా వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. భారత జట్టు చేతిలో వరుసగా ఎదురైన పరాజయాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments