కోహ్లీకి తప్పని జరిమానా.. రోహిత్, రహానే, ధోనీకి తర్వాత విరాటే,..?

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (12:22 IST)
స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీపై ఐపీఎల్ మేనేజ్‌మెంట్ జరిమానాను విధించింది. శుక్రవారం జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి జరిమానా విధించినట్లు ఐపీఎల్ వెల్లడించింది.


ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, నియమిత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడం నేరమన్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ మ్యాచ్ ఫీజులో కొంత జరిమానాగా చెల్లించక తప్పలేదు.
 
ఈ సీజన్‌లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా చెల్లించిన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ లోనే రోహిత్ జరిమానా కట్టాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానే కూడా ఇదే తరహా శిక్షకు గురయ్యాడు.
 
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా పడింది. గురువారం రాత్రి రాజస్థాన్‌  రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. దీంతో మిస్టర్‌ కూల్‌కు చేదు అనుభవం ఎదురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments