Webdunia - Bharat's app for daily news and videos

Install App

కటక్ వన్డే : రెచ్చిపోయిన కరేబియన్లు .. భారత్ ముంగిట భారీ లక్ష్యం

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (17:33 IST)
కటక్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ ఆఖరి మ్యాచ్‌ కోసం తుది జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాధవ్, రవీంద్ర జడేజా, షమీ, ఠాకూర్, కె.యాదవ్, ఎన్ షైనీ ఉన్నారు. 
 
ఈ మ్యాచ్‌లో వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలుపొందింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన జట్టే సిరీస్ విజేతగా నిలుస్తుంది.
 
అయితే, బ్యాటింగ్‌కు అనుకూలించే ఇక్కడి పిచ్ పై ప్రమాదకర విండీస్ ఓపెనర్లను ఓ మోస్తరు స్కోర్లకు అవుట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్‌కు ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్ (42) శుభారంభాన్నందించారు. తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అలాగే, ఛేజ్ 38, హత్మియర్ 37, పూరన్ (89), పొల్లార్డ్ (74), హోల్డర్ (7)లు చొప్పున పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ ముందు 316 భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా టీమిండియాకు బ్రేకిచ్చాడు. లూయిస్‌ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత కాసేపటికే హోప్‌ను షమీ అవుట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే, కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కటక్‌లో నిప్పులు చెరిగాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

తర్వాతి కథనం
Show comments