Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌.. సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?

భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌.. సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?
, శనివారం, 21 డిశెంబరు 2019 (11:44 IST)
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై మాటెత్తారు. పాకిస్థాన్‌తో క్రికెట్ తమ పరిధిలో లేదని గంగూలీ పేర్కొన్నాడు. ఈ విషయంలో తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదేనని గంగూలీ స్పష్టం చేశారు.

భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు ముంబైపై ఉగ్రదాడుల తర్వాత తెగిపోయిన నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య క్రికెట్ ఆడటం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి వుందని గంగూలీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు. 
 
కానీ భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు త్వరలోనే బలపడతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పీసీబీలో చేరి ఆరు నెలలు గడిచిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాగా.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ముంబై పేలుళ్ల అనంతరం టెస్టు, వన్డే, టీ20 క్రికెట్ సిరీస్‌లు జరగట్లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పానీపూరీ అమ్మిన యశస్వి.. ఐపీఎల్ పుణ్యంతో కరోడ్‌పతిగా మారాడు.. (video)