Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ 15 సీజన్ పోటీలు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (11:00 IST)
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్నాయి. మార్చి నెలాఖరులో ఈ పోటీలను నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఐపీఎల్ 15వ సీజన్ పోటీలను స్వదేశంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. 
 
ఐపీఎల్ 15వ సీజన పోటీలను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కరోనా కేసులు అదుపులోకి రానిపక్షంలో లీగ్‌ను మరో దేశానికి తరలించక తప్పదన్నారు. స్వదేశంలోనే ఈ పోటీలు జరగాలని అన్ని ఫ్రాంచైజల యాజమానులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. 
 
ఒక వేళ స్వదేశంలో ఈ పోటీలు నిర్వహిస్తే మాత్రం అన్ని ఫ్రాంచైజీలు కోరుకున్నట్టుగా వాటివాటి సొంత నగరాల్లో ఈ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యంకాకపోవచ్చని తెలిపారు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆటగాళ్ళ భద్రత ముఖ్యమన్నారు. 
 
అందువల్ల మహారాష్ట్రలోని ముంబై, పూణెలలో పలు మైదానాలు ఉన్నందున, విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండానే కొత్త సీజన్‌లో పోటీలును ఆ మైదానాల్లోనే నిర్వహిచేలా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments