Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి ఐపీఎల్ టోర్నీ టిక్కెట్ల విక్రయం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (20:56 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ పోటీల నిర్వహణ కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ పోటీలను ఇపుడు యూఏఈ వేదికగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు గురువారం నుంచి టికెట్లు అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 
 
ఈ టిక్కెట్లను ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.iplt20.com నుంచి వాటిని కొనుగోలు చేసుకోవచ్చని టోర్నీ నిర్వహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కొవిడ్‌-19 నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. 
 
ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఈ ఏ ఏడాది ఏప్రిల్‌లో తొలుత భారత్‌లో నిర్వహించగా బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. దీంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వహకులు ఆ రోజు ప్రకటించారు. 
 
ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 19 నుంచి మళ్లీ ఈ టోర్నీని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో అన్ని ఫ్రాంఛైజీలు ఇప్పటికే యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలెట్టాయి. యూఏఈ నిబంధనలకు అనుగుణంగా ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నామని నిర్వహకులు ఒక ప్రకటనలో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

తర్వాతి కథనం
Show comments