Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి ఐపీఎల్ టోర్నీ టిక్కెట్ల విక్రయం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (20:56 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ పోటీల నిర్వహణ కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ పోటీలను ఇపుడు యూఏఈ వేదికగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు గురువారం నుంచి టికెట్లు అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 
 
ఈ టిక్కెట్లను ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.iplt20.com నుంచి వాటిని కొనుగోలు చేసుకోవచ్చని టోర్నీ నిర్వహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కొవిడ్‌-19 నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. 
 
ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఈ ఏ ఏడాది ఏప్రిల్‌లో తొలుత భారత్‌లో నిర్వహించగా బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. దీంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వహకులు ఆ రోజు ప్రకటించారు. 
 
ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 19 నుంచి మళ్లీ ఈ టోర్నీని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో అన్ని ఫ్రాంఛైజీలు ఇప్పటికే యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలెట్టాయి. యూఏఈ నిబంధనలకు అనుగుణంగా ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నామని నిర్వహకులు ఒక ప్రకటనలో చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments