Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - పాకిస్థాన్ యుద్ధం - ఐపీఎల్ 2025 పోటీలు రద్దు

ఠాగూర్
శుక్రవారం, 9 మే 2025 (12:49 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధంమొదలైంది. దీంతో ఇరు దేశాలమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వాతావరణం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. దీంతో గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పూర్తిగా రద్దు చేసింది. 
 
కాగా, ఈ టోర్నీలోభాగంగా, గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేశారు. భద్రతా కారణాలతోనే ఆపేసినట్లు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్ కూడా ప్రేక్షకులు త్వరగా వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశాడు. 
 
జమ్మూకాశ్మీర్, పఠాన్ కోట్ ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ధర్మశాలలో ముందస్తుగా ఆటను నిలిపేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, ఐపీఎల్ సభ్యులు, ప్రేక్షకులు మైదానాన్ని ఖాళీ చేసేశారు. ఈ క్రమంలో ఓ ఛీర్ లీడర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
"స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించేశారు. ఇక్కడంతా భయంగా ఉంది. ప్రతిఒక్కరూ బాంబులు వస్తాయేమోనని అరుస్తూ వెళ్లిపోయారు. ధర్మశాలను వదిలి వెళ్లడం బాధగా ఉంది. ఐపీఎల్ ప్రతినిధులు సరైన చర్యలు తీసుకున్నారు. అయితే, నేను ఎందుకు ఏడవడం లేదనేది తెలియడం లేదు. ఇప్పటికీ షాక్లోనే ఉన్నా' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో వీడియో వైరల్‌గా మారింది.
 
మరోవైపు, ధర్మశాల నుంచి ఆటగాళ్లను తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. ధర్మశాలలో విమానాశ్రయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీకి తీసుకెళ్లేందుకు వందే భారత్ రైలును బీసీసీఐ అధికారులు ఏర్పాటుచేశారు. దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై చైర్మన్ అరుణ్ ధుమాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

తర్వాతి కథనం
Show comments