దివ్యాంగులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ క్రికెట్ సంఘం

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (13:43 IST)
దేశంలో సంపన్న క్రీడగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ పోటీలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని భావించే దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ పాస్‌లను జారీ చేస్తామని ప్రకటించింది. 
 
ఈ టిక్కెట్లు కావాల్సిన వారు పేరు, కాంటాక్ట్ నంబర్, వ్యాలిడీ డిజబులిటీ ప్రూఫ్ సర్టిఫికేట్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలి వంటి పూర్తి వివరాలతో pcipl18rgics@gmail.com అనే మెయిల్‌కు పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. సీట్లు పరిమితంగా ఉంటాయి కనుకు మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఆధారంగా పాస్‌‍లు మంజూరు చేస్తామని తెలిపింది. 
 
కాగా, మరోవైపు, గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో లక్నో సూపర్ జైంట్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments