Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఐపీఎల్ వేలం... అంగట్లో సరకుల్లా కొనుగోలుకు 333 మంది ఆటగాళ్లు

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (07:37 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు మంగళవారం దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. ఈ వేలం పాటల్లో కొనుగోలు చేసేందుకు ఏకంగా 333 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇందులో విదేశీ ఆటగాళ్లు 119 మంది ఉన్నారు. ఈ వేలం పాటల కోసం దుబాయ్‌లో అన్ని ఏర్పాట్లుచేశారు. 
 
ఇటీవల భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీతో మెరిసిన ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిడ్ హెడ్, సౌతాఫ్రికా యువ పేసర్ గెరాల్డ్ కోట్జీలు నేటి వేలం పాటల్లో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నారు. పైగా, వీరికి రికార్డు స్థాయిలో ధర పలికే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, ఈ వేలం పాటల్లో యాక్షనర్‌గా మల్లికా సాగర్ వ్యవహరిస్తారు. మల్లికా సాగర్ ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐపీఎల్ వేలం ప్రక్రియను స్టార్ స్పోర్ట్స్ చానెల్‌, జియో సినిమా ఓటీటీ వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఆటగాళ్ల వేలం పాటలు ప్రారంభంకానున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

తర్వాతి కథనం
Show comments