Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 యేళ్ళ తర్వాత చెన్నైను సొంత గడ్డపై చిత్తు చేసిన బెంగుళూరు

ఠాగూర్
శనివారం, 29 మార్చి 2025 (00:02 IST)
ఐపీఎల్ 18వ సీజన్ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నైలోని చెప్పాక్కం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. పైగా చెన్నైను వారి సొంత మైదానంలో ఆర్సీబీ జట్టు 17 యేళ్ల తర్వాత ఓడించింది. ఈ మ్యాచ్‌లో 197 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
చెన్నై జట్టులో రచిన్ రవీంద్ర 41, రాహుల్ త్రిపాటి 5, దీపక్ హుడా 4, సామ్ కరన్ 8, శివమ్ దూబే 19, కెప్టెన్ రుతురాజ్ 0 చొప్పున పరుగులు చేశారు. బెంగుళూరు బౌలర్లలో జోష్ హేజల్ వుడ్ 3, యశ్ దయాల్ 2, లివింగ్‌స్టోన్ 2 చొప్పున, భువనేశ్వర్ ఒక వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్ 51 అర్థ సెంచరీతో రాణించగా, పిల్ సాల్ట్ 32, విరాట్ కోహ్లీ 31 చొప్పున పరుగులు చేసి మంచి సుభారంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్‌‍లోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫలితంగా ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments