Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ - పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (11:24 IST)
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా, ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు చేతిలో కలిగిన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. డీసీ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి ఛేదించింది. 
 
కృనాల్ పాండ్యా అల్‌రౌండ్ మెరుపులకు తోడు విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక మోస్తరు ఛేదనతో బరిలోకి దిగిన బెంగుళూరుకు ప్రారంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. 4 ఓవర్ల ముగిసేసరికి బెంగుళూరు 3 వికెట్ల కోల్పోయి కేవలం 26 రన్స్ మాత్రమే చేసింది. 
 
డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్.. ఒకే ఓవరులో బెతెల్(12)తో పాటు పడిక్కల్ (0)ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కరుణ్ మెరుపు త్రో తో ఆర్సీబీ సారథి రజిత్ పాటీదార్ (6) రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా.. కోహ్లీతో కలిసి బెంగుళూరు ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా, కోహ్లీతో కలిసి బెంగుళూరు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. డీసీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 12 ఓవర్లలోనూ ఆర్సీబీ స్కోరు 78/3గానే ఉంది. 
 
కానీ, ముకేశ్ 13వ ఓవర్ నుంచి కృనాల్ గేర్ మార్చాడు. ఓ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన అతడు కుల్దీప్ ఓవర్‌లోనూ ఓ సిక్స్ బాదాడు. అక్షర్ బౌలింగ్‌లో బౌండరీతో కృనాల్ అర్థ శతకం పూర్తయింది. కోహ్లీ కూడా వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే, బెంగుళూరు విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లీ నిష్క్రమించినా కృనాల్, డేవిడ్ (19 నాటౌట) లాంఛనాన్ని పూర్తి చేశాడు. 
 
ఈ విజయంతో బెంగుళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ఆర్సీబీ అగ్రస్థానానికి ఎగబాకింది. మరోవైపు, గుజరాత్, ముంబై, ఢిల్లీ, పంజాబ్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2025లో ప్రత్యర్థి వేదికల్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఆర్బీసీ సొంతం చేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్

Seaplane: మార్చి నాటికి తిరుపతి కల్యాణి డ్యామ్‌లో సీప్లేన్ సేవలు

North Andhra: అల్పపీడనం- ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరప్రాంతంలో భారీ వర్షాలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

తర్వాతి కథనం
Show comments