Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో సందడి చేసిన రిషబ్ పంత్

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (09:58 IST)
ఐపీఎల్ 2023 సీజన్‌లో భారత క్రికెటర్ రిషబ్ పంత్ సందడి చేశాడు. గత యేడాది ఆఖరులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్.. ప్రస్తుతం కొంతమేరకు కోలుకున్నారు. ముఖ్యంగా ఆయన మోకాలికి ఆపరేషన్ చేయడంతో నిరవధికంగా ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో సందడి చేశారు. 
 
మంగళవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ - గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన ఊతకర్ర సాయంతో ఆడియన్స్ గ్యాలెరీలో కనిపించారు. బీసీసీఐ ఉన్నతాధికారులు కూర్చునే గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ ఢిల్లీ కెప్టెన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావడంతో లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో డీసీ జట్టు డగౌట్లో అతడి జెర్సీని ప్రదర్శించడం తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. 
 
రిషబ్‌ జెర్సీని ఇలా డగౌట్లో ఉంచొద్దని ఢిల్లీ ఫ్రాంఛైజీకి బీసీసీఐ సూచించినట్లు తెలిసింది. 'డగౌట్‌పై పంత్‌ జెర్సీని వేలాడదీయడం బాగోలేదు. ఏదైనా విషాదం లేదా రిటైర్‌మెంట్‌ సమయంలోనే ఇలాంటివి చూస్తాం. పంత్‌ క్షేమంగా ఉన్నాడు. ఊహించి దానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఒక మంచి ఆలోచనతోనే ఢిల్లీ ఈ పని చేసినా.. ఇలాంటి చర్యలు మానుకోవాలని' బీసీసీఐ సూచించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments